ఏపీ సీఎం జగన్ ఆ మధ్య గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. జూలై నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగూరు వెళ్లిన జగన్ ను ఒక చిన్నారి విపరీతంగా ఆకట్టుకుంది. జగన్ పర్యటనలో కారం సంధ్య అనే చిన్నారి చలాకీగా కనబడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. చిరునవ్వులు చిందిస్తూ.. జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉత్సాహంగా కనిపించింది. ఆ చిన్నారి మాటలకు జగన్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఆ పాప అందరినీ విషాదంలో ముంచేసి వెళ్ళిపోయింది. తన మాటలతో ఆకట్టుకున్న చిన్నారి చిరునవ్వులు ఇప్పుడు లేవు. భద్రాచలంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూసింది.
మాజీ సర్పంచ్ గా పనిచేస్తున్న ఏసుబాబు కూతురు ఈ కారం సంధ్య. ఏసుబాబుకి జ్వరం రాగా.. ఆయన చికిత్స కోసం హాస్పిటల్ లో జాయినయ్యారు. కోలుకున్న తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజే సంధ్యకు జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు వాంతులు కూడా అవుతున్నాయని ఆమె తండ్రి ఏసుబాబు భద్రాచలంలోని చింతూరు ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లారు. అయితే దురదృష్టవశాత్తు చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది.
5వ తరగతి చదువుతున్న కారం సంధ్య తల్లి అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తుంది. జగన్ పర్యటనలో చాలా చురుగ్గా సమాధానాలు చెబుతూ ఆకట్టుకుంది. “మా ఇంట్లో మేము ఇద్దరు పిల్లలమని, మాకు అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు అందాయని, తన అక్క కంటే తనే బాగా చదువుతానంటూ” జగన్ ని ఆకట్టుకునే విధంగా మాట్లాడింది. జగన్ పర్యటనలో తన మాటలతో ఆకట్టుకున్న చిన్నారి నెల తిరక్కముందే మరణించడం అందరినీ కలచివేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: AP: అర్థరాత్రి భారీ ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు!