ప్రకాశం జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 300 నిండు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 100కు పైగా సిలిండర్లు పేలినట్లు సమాచారం. లారీ పూర్తిగా కాలిపోయింది. అనంతపురం-గుంటూరు నేషనల్ హైవే మీద గురువారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన లారీలో భారత్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటిని కర్నూలు నుంచి నెల్లూరు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి లారీ క్యాబిన్లో మంటలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే కిందరకు దిగి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. దీని గురించి పోలీసులకు సమాచారం తెలియడంతో.. వారు జాతీయ రహదారిపై ఇరు వైపులా అర కిలోమీటర్ దూరం వరకు వాహనాలను నిలిపివేశారు. కాసేపటి తర్వాత నుంచి లారీలో ఉన్న సిలిండర్లు పేలడం ప్రారంభం అయ్యింది. ఈ సంఘటన గురించి తెలిసి అప్రమత్తమైన హైవే పోలీసులు.. ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దుద్దవాడ గ్రామంలోని సుమారు 30 ఇళ్లను ఖాళీ చేయించారు. అగ్ని మాపక యంత్రాలు అక్కడకు వచ్చినప్పటికి.. లారీ దగ్గరకు వెళ్లే అవకాశం లేకపోవడంతో.. 200 మీటర్ల దూరం నుంచే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదం కారణగా పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వరద నీటిలో చిక్కుకున్న 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకుంటా అంటూ స్కూల్ బిల్డింగ్ ఎక్కిన విద్యార్థిని.. చివరికి..