మన దేశంలో భక్తికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఏడాది పొడవునా పండగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వేర్వేరు దేవుళ్ల దీక్ష తీసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఆలయాల్లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. సైన్స్ వాటిని అంగీకరించకపోయినా.. సామాన్యులు మాత్రం దైవ లీలగానే భావిస్తారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఏపీలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ముందు కలశానికి పెట్టిన గాజులు వాటంతట అవే తిరిగిన వీడియో ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట మరోసారి వైరలవుతోంది. ఆ వివరాలు..
తూర్పు గోదావరి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది అంటూ ఓ వీడియో వైరలయ్యింది. కార్తీక మాసం ముగింపు వేళలో ఇలాంటి అద్భుతం చోటు చేసుకోవడంతో.. ఇది కచ్చితంగా దేవుడి మహిమే అంటున్నారు జనాలు. అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు.
ఈ వింత సంఘటన కడియం మండలం కడియపులంకలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచి ఉన్నట్లు గుర్తించారట కొందరు భక్తులు. ఈ విషయం కాస్తా.. ఆ నోటా ఈ నోటా అందరికీ తెలియడంతో.. ఈ మహిమను స్వయంగా చూసేందుకు భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. అమ్మవారి విగ్రహం కళ్లు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. కార్తీక మాసంలో జరిగిన అద్భుతమంటూ భక్తులు దీని గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.