ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడి భక్తులు వస్తుంటారు. భక్తులు స్వామి వారికి భారీ విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు స్వామి వారికి వజ్రకిరీటం బహుకరించాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన లలితా ఎంటర్ ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మట్టే సత్య ప్రసాద్ అనే భక్తుడు వజ్రకిరీటాని స్వామి వారికి బహుకరించారు.
మట్టే సత్య ప్రసాద్ సుమారు ఒకటిన్నర కోటి రూపాయల వ్యయంతో ఈ వజ్ర కిరీటాన్ని తయారు చేయంచారు. 682.230 గ్రాముల బంగారం,114.41 క్యారెట్ల వజ్రాలు,14.97 క్యారెట్ల కెంపు పచ్చ తో చేసిన వజ్ర కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వనున్నారు. ఈ వజ్రకిరీటాన్ని దేవస్థానానికి దాత అందించారు. సత్యదేవుని 132 వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం కిరీటానికి ప్రత్యేక పూజలు , స్వామివారికి పంచామృతాభిషేకాలు అనంతరం అలంకరించనున్నారు. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్య దేవుని ఆలయం మహిమాన్వితం. ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో సత్యదేవునితో పాటు శ్రీ సీతారాముల వారి గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి.
కొండ కింద గ్రామ దేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. దీంతో గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. స్వామి వారికి నిత్యం పూజలు, ఆర్చనలు మరియు భక్తుల సామూహిక వ్రతాలు జరుగుతాయి. మరి.. స్వామి వారికి వజ్రకిరీట బహుకరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.