భర్త అడుగు జాడల్లో నడిచి, అతడి తిన్న తర్వాత తిని, అతడి సేవలో మునిగి తేలిపోతుంది భార్య. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయణేషు రంభ అనే పదాలకు నిలువుటద్దం భార్య.
భర్త అడుగు జాడల్లో నడిచి, అతడి తిన్న తర్వాత తిని, అతడి సేవలో మునిగి తేలిపోతుంది భార్య. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయణేషు రంభ అనే పదాలకు నిలువుటద్దం భార్య. అయితే అభివృద్ధి పోకడలో భాగంగా దాంపత్య విలువలు భార్య తిలోదకాలు ఇచ్చేస్తుంది. భర్తను కాదని మరొకరితో భార్య సరస సలాపాల్లో మునిగి తేలుతుంది. స్త్రీ జాతికి మాయని మచ్చగా మారిపోతుంది. ఒకరిద్దరి వల్ల మహిళలంతా చెడ్డవాళ్లే అన్న అపవాదును మూటగట్టుకోవలసి వస్తుంది. పసుపు,కుంకుమలే ఐదో తనంగా భావించే భార్యల్లో కొంత మంది, పరాయి వ్యక్తుల మోజులో మంగళ సూత్రాన్ని తమ చేత్తో తామే తెంపుకునేందుకు సిద్ధమౌతున్నారు. అటువంటిదే ఈ సంఘటన.
ప్రియుడి కోసం భర్తను కడతేర్చాలని ప్రయత్నించిన భార్య ప్లాన్ బెడిసికొట్టి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెలితే.. జిల్లాలోని కుమ్మరి వీధికి చెందిన కోటరాజు, శ్రీదేవి భార్యా భర్తలు. వీరికి పిల్లులు ఉన్నారు. అయితే చిన గోక వీధికి చెందిన గంధవరపు రఘుతో శ్రీదేవికి పరిచయం ఏర్పడి.. శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. చంపేయాలని నిర్ణయించుకుంది. తన భర్తను చంపేస్తే.. మనిద్దరం హాయిగా ఉండవచ్చునని ప్రియుడు రఘుకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఓ పథకాన్ని రచించారు. అందులో భాగంగా ఆర్ఎంపీ డాక్టర్ నుండి నిద్రమాత్రలు తెచ్చిన రఘు.. శ్రీదేవికి ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మటన్ బిర్యానీ వండి, అందులో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. వాటిని తిన్నఅతడు నిద్రలోకి జారిపోయాడు. అనంతరం ప్రియుడు రఘుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. రఘు, తన బావమరిది శ్రీనుతో కలిసి ఇంటికి వెళ్లి.. రాజుకు మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో భర్త కోట రాజుకు మెళుకువ వచ్చి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి వారిద్దరూ పారిపోయారు. బాధితుడు వెంటనే తెరుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. శ్రీదేవి, రఘు, శ్రీనులను అరెస్టు చేసి విచారించగా.. నేరాన్ని అంగీకరించారు.