చిన్నచిన్న కారణాలకే భార్యపై ఒంటి కాలిపై ఎగురుతూ.. అయిన దానికి, కాని దానికి రచ్చ చేస్తారు. చిన్న మాటను కూడా బూతద్దంలో వెతికి.. భార్య ఏదో అనరాని మాటలు అన్నట్లు మండిపడిపోతుంటాడు. ఇక ఆ విషయాన్ని పట్టుకుని జీవితాంతం వేధిస్తుంటారు. భార్య మాట వినడం లేదని భర్త క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేసే భర్త.. భార్యను వేధిస్తున్నాడు. చిన్నచిన్న కారణాలకే భార్యపై ఒంటి కాలిపై ఎగురుతూ.. అయిన దానికి, కాని దానికి రచ్చ చేస్తున్నాడు. చిన్న మాటను కూడా బూతద్దంలో వెతికి.. భార్య ఏదో అనరాని మాటలు అన్నట్లు మండిపడిపోతుంటాడు. ఇక ఆ విషయాన్ని పట్టుకుని జీవితాంతం వేధిస్తుంటారు. భార్య మాట వినడం లేదని భర్త క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పిల్లలను తల్లిలేని బిడ్డలుగా మారిపోతున్నారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన వారిని కూడా చంపేందుకు వెనుకాడటంల లేదు కొందరు. అటువంటిదే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
భార్య, అత్తను అత్యంత పాశవికంగా కర్రతో కొట్టి చంపిన ఘటన జిల్లాలోని కౌతాలం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలారి హనుమంతమ్మ, మహాదేవీ తల్లి కూతుళ్లు. మహాదేవి స్థానికంగా వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. మహాదేవీకి ఐదేళ్ల క్రితం వీరలదిన్నె గ్రామానికి చెందిన దస్తగిరితో వివాహం అయ్యింది. అయితే వివిధ కారణాలతో విడిపోయారు. అయితే ఆమెకు కర్ణాటకలోని టెక్కలికోటకు చెందిన బోయ రమేష్తో నెల రోజుల క్రితం రెండో వివాహం జరిగింది. వివాహం అయ్యాక తనతో వచ్చేయాలని రమేష్ పదేపదే పోరు పెడుతున్నాడు. తల్లిని విడిచి పెట్టి రానని మహాదేవీ చెబుతుంది. ఈ విషయంపైనే వీరిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా దీనిపై మహాదేవీ, రమేష్ గొడవపడ్డారు.
తన తల్లిని వదిలేసి రానని తెగేసి చెప్పడంతో కోపంతో ఊగిపోయిన రమేష్.. భార్య మహాదేవి, అత్త హనుమంతమ్మను కర్రతో దారుణంగా కొట్టాడు. వీరు పెట్టిన కేకలకు చుట్టూ ప్రక్కల వారు హనుమంతమ్మ సోదరుడు అయ్యప్పకు సమాచారం చేరవేశారు. అయ్యప్ప .. అక్క ఇంటికి వెళ్లేసరికి వారిద్దని హత్య చేసేశాడు రమేష్. ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూసిన అయ్యప్ప పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై నరేంద్రకుమార్రెడ్డి మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం తరలించారు. హనుమంతమ్మ సోదరుడు అయ్యప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.