ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఏ చిన్న ఛాన్స్ దొరినా వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన ఉనికి చాటుకోవడానికి తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో బీజేజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పార్టీ బలోపేతం చేయడానికి అన్నిరకాలుగా కష్టపడుతున్నారు. బటన్లు నొక్కడం తప్పా సీఎం జగన్ చేసిన అభివృద్ది ఏమీ లేదని పలు సందర్భాల్లో విమర్శనాస్త్రాలు సందిస్తూ వస్తున్నారు.
వైసీపీ, టీడీపీ ఏపీని అభివృద్ది చేయలేవని.. బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామని ప్రజల మద్దతు కూడగట్టుకనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ కి పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు లో మిర్చీ ఎగుమతిదారుల అసోసియేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోకి ప్రవేశించేందుకు సాంప్రదాయంగా ఒక ఆవును తీసుకు వచ్చారు.
పూజా కార్యక్రమాలు చేసిన ఆయన ఆవుకు దణ్ణం పెట్టేందుకు వెళ్లగా వెనుక కాలితో ఆయనపై దాడి చేసింది. అది ఒక్కసారే ఆయన మీద దాడి చేసింది. రెండోసారి ప్రయత్నించగా జీవీఎల్ పై గోమాత మళ్లీ దాడి చేయగాని వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తమై ఆయను పక్కకు జరిపారు. అయితే ఆవును కట్టివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. తర్వాత కార్యక్రమాలు పూర్తి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.