రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఈ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్దఎత్తున హాజరయ్యారు. దాదాపు 15 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అందరి ప్రార్థనలు సఫలీకృతం కావాలంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు. ఆ దేవుడి ఆశీసులతో అందరూ ఆనందంగా ఉండాలంటూ కోరుకున్నారు. ప్రతిఒక్కరు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలని సూచించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ముస్లింల తరఫున సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ముస్లిం, మైనారీటీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వమే అంటూ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్ కే దక్కుతుందంటూ ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం వైయస్ జగన్.#CMYSJagan pic.twitter.com/jyFJFDjFqM
— YSR Congress Party (@YSRCParty) April 17, 2023