సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణయణ జగన్ ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఇక అసలు విషయానికి వస్తే షుగర్ ఫ్యాక్టరీ బకాయిల కోసం విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్ సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రైతులు ధర్నా చేస్తున్నారు. రైతుల ఆందోళనల చేస్తూ హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు రాళ్లు, కర్రలతో వారిపై దాడి చేశారు. దీంతో పోలీసులు వెనుదిరగక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు స్పందించాయి. ఈ పరిణామాలతో చెరకు రైతుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
On behalf of the farmers under Vijayarama Gajapathi Sugar factory , Bhimasingi, vijayanagaram ,we express gratitude to @AndhraPradeshCM, @kannababu_k ,Cane Commissioner,collector & Jt. Collector,for taking the decision to allocate the sugarcane to M/s EID Parry (India),Srikakulam pic.twitter.com/UAhZ2btGeO
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) November 8, 2021
ప్రభుత్వ నిర్ణయానికి జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ “విజయరామ గజపతి చక్కెర కర్మాగారం, భీమసింగి, విజయనగరం రైతుల తరఫున చెరకును M/s EID ప్యారీ(భారతదేశం)కీ కేటాయించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ధన్యవాదాలు” అని ట్విట్ చేశారు.
విజయరామ గజపతి చక్కెర కర్మాగారం, భీమసింగి, విజయనగరం రైతుల తరపున- చెరుకును, శ్రీకాకుళంలోని M/s EID ప్యారీ (భారతదేశం)కి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నందుకు @AndhraPradeshCM, @kannababu_k, కేన్ కమిషనర్, కలెక్టర్ & Jt. కలెక్టర్ గార్లకు ధన్యవాదాలు. pic.twitter.com/jt1DDDmsDr
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) November 8, 2021