రక్షాబంధన్.. తోబుట్టువులు బాంధవ్యాలకు గుర్తుగా జరుపుకునే పండుగా. ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి.. తమ ప్రేమను చాటుకుంటారు. అలానే సోదరులు తమ తోబుట్టువులకు జీవితాంతం తోడుగా ఉంటామని భరోసా ఇస్తారు. ఇలా ప్రతి ఏడాది అందరు ఎంతో సంతోషంగా రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటారు. అలానే ఓ కుటుంబంలోని తోబుట్టువులు నలుగురూ కలిసి ఎప్పుడూ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకునే వారు. ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులతో ఆ ఇల్లు సందండిగా ఉండేది.
అలా ప్రేమానూబంధాలతో ఉన్న ఆ కుటుంబంలో అనుకోని ఘటన ఒకటి చోటుచేసుకుంది. వారిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో మిగిలిన ముగ్గురు తమ తోబుట్టువు మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆమెలేని లోటు పూడ్చాలనుకున్నారు. ఆమె విగ్రహాన్ని చేయించి ఈ ఏడాది రక్షాబంధన్ ను ఊరంతా పండగలా నిర్వహించారు. ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే ఈ అరుదైన ఘటన కాకినాడ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు మణి(29)కి అక్క వరలక్ష్మి, అన్నయ శివ, తమ్ముడు రాజా ఉన్నారు. వీరు చిన్నతనం నుంచి రాఖీ పండుగ వస్తే ఎంతో సంతోషంగా జరుపుకునే వారు. అలా ప్రేమానుబంధాలతో పెరిగి పెద్ద అయినా ఆ నలుగురు తోబుట్టువులు ఓ ఇంటి వారయ్యారు. అయినప్పటికి వారంత రాఖీ పండుగను పుట్టింట్లో కలిసి ఆనంద జరుపుకునే వారు. ఆ తోబుట్టువుల్లో ఒకరైన మణి 7 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె అకాల మృతిపై అక్క వరలక్ష్మి, సోదరులు శివ, రాజా తీవ్రంగా ఆవేదన చెందారు. చిన్నతనం నుంచి తమతో పెరిగిన తమ సోదరి జ్ఞాపకాలను పదిలపరచుకొవాలని మిగిలిన ముగ్గురు భావించారు. దీంతో ఆ మహిళ విగ్రహాన్ని తయారు చేయించారు.
తాజాగా రక్షాబంధన్ వేడుక వేళ గురువారం తోబుట్టువులు ఆ సోదరి విగ్రహాన్ని ఊరిలో ఊరేగించారు. చివరికి తమ ఇంటి వద్ద ప్రతిష్ఠించుకున్నారు. ఆమె సోదరులు మాట్లాడుతూ..”ఏటా రాఖీ పండుగను అంతా కలిసి ఆనందంగా జరుపుకొనే వాళ్లం. ఈసారి ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె మా మదిలో నిరంతరం స్మరించుకునేలా విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ద్విచక్ర వాహన ప్రమాదంలో సోదరి మాకు దూరమైంది. బైక్ పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రామంలో ప్రచారం చేశాం” అని తెలిపారు. మరి.. అన్న చెల్లెల అనుంబంధానికి ప్రతీకగా నిలిచే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rakhi Festival 2022 pic.twitter.com/lQeq4Bcrfc
— Sekhar Rambo (@RamboSekhar) August 12, 2022