Raksha Bandhan 2022: రక్షా బంధన్ రోజు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి మంచి జరగాలని కోరుకుంటారు. అక్క, చెల్లెల్లు తమ స్థోమతకు తగ్గట్టు రాఖీలు కొని సోదరులకు కడుతుంటారు. పేద, మధ్య తరగతి వాళ్లకోసం ఓ రకమైన రాఖీలు అందుబాటులో ఉంటే.. ధనవంతుల కోసం కూడా ఖరీదైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ బంగారం షాపు ఖరీదైన రాఖీలను తయారు చేసి అమ్మకానికి పెట్టింది. దారంతో తయారు చేసిన రాఖీలతో పాటు బంగారం, సిల్వర్, ప్లాటినమ్ రాఖీలు కూడా ఆ షాపులో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇవి మాత్రమే కాదు... వజ్రాలు పొదిగిన రాఖీలు కూడా ఈ షాపులో ఉన్నాయి. ఈ షాపు అంతటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాఖీ ఒకటి ఉంది. మొత్తం బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఆ రాఖీ ధర అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. ఆ రాఖీపై ‘ఓం’ అనే అక్షరం అందంగా చెక్కబడి ఉంది. ఈ షాపు యజమాని దీపక్ భాయ్ చోస్కీ మాట్లాడుతూ.. ‘‘ మేము తయారు చేసే రాఖీలు రక్షా బంధన్ తర్వాత కూడా ఆభరణాలుగా వాడుకోవచ్చు. మేము ప్రతీ ఏటా ఈ పవిత్రమైన పండగను కొత్త పద్దతిలో జరపాలని ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మరి, ఈ ఐదు లక్షల రూపాయల రాఖీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : రూ.కోటి గెలుచుకున్న యువకుడు.. ఆ డబ్బుకోసం ప్రాణ స్నేహితులే పైశాచికంగా..!