Bear: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జీడి మామిడి తోటల్లో మాటు వేసి, జనంపై దాడులు చేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఏడుగురు తీవ్రగాయాల పాలవ్వగా.. ఒకరు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో మొత్తం 6గురి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరుకు చెందిన సిర్ల నర్సింహమూర్తి జీడితోటలో సిర్ల చలపతి, తామాడ షణ్ముఖరావు పశువుల పాక నిర్మిస్తున్నారు. 10.30 గంటల సమయంలో ఓ ఎలుగు బంటి హఠాత్తుగా వారిపై దాడి చేసింది. వారి కేకలు విని రోడ్డుపై వెళుతున్న కలిశెట్టి అప్పలస్వామి, మరో వ్యక్తి ఉప్పరపల్లి అక్కడకు వచ్చారు. వీరిపై కూడా ఆ రాకాసి దాడి చేసింది. వీరందరి అరుపులు విని అక్కడికి వచ్చిన జవాన్లు పోతనపల్లి తారకేశ్వరరావు, పోతన పల్లి పురుషోత్తం పైనా దాడి చేసింది.
పురుషోత్తం ఎలుగు బంటిని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఇంతలో జనం గుంపులుగా రావటంతో అది పక్కనున్న తోటల్లోకి వెళ్లిపోయింది. ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని పలాస ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఓ ఐదుగురిని అక్కడినుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఎలుగు బంటిని వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి : Muzzafarnagar: ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదని.. అమ్మాయిపై దారుణం!