ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త బండ్లపల్లి మదన మోహన్ రెడ్డి. ఇక ఇప్పటికే మదన మోహన్ రెడ్డి పలువురు నాయకులను, విద్యావేత్తలను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఇందుకోసం సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త బండ్లపల్లి మదన మోహన్ రెడ్డి. ఇక ఇప్పటికే మదన మోహన్ రెడ్డి పలువురు నాయకులను, విద్యావేత్తలను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను గెలిపిస్తే.. ఉపాధ్యాయుల సమస్యల తరపున పోరాడతానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా పశ్చిమ రాయలసీమ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడున్నారు ప్రముఖ సామాజిక వేత్త, రాయలసీమ రూరల్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ సొసైటీ(రాడ్స్) వ్యవస్థాపకులు బండ్లపల్లి మదన మోహన రెడ్డి. ఇక ఇప్పటికే పలువురు విద్యావేత్తలను, రాజకీయ నాయకులను, ఉపాధ్యాయ సంఘాలను కలిసి మద్ధతు కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.”ఎన్నో సేవలు రాయలసీమకు నేను అందించాను. గతంలో కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి పల్లంరాజు దగ్గర పనిచేసిన క్రమంలో ఎన్నో విద్యా సంస్థలను మంజూరు చేయించాను. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతాను. ప్రవేట్ టీచర్లకు కూడా హెల్త్ కార్డులు, పెన్షన్ ఇవ్వాలని అని కోరుతున్నాను. ఇక నేను గెలిస్తే.. ఏ పార్టీలో చేరను” అని స్పష్టంగా చెప్పుకొచ్చారు మదన మోహన్ రెడ్డి.