దేశాన్ని రెండేళ్లు పట్టి పీడించిన కరోనా కొంతకాలం తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి.
రెండు సంవత్సరా క్రితం ప్రపంచాన్ని గడ గడలాడించింది కరోనా మహమ్మారి. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందని అందరూ భావించారు… కానీ ఈ మద్య మళ్లీ విజృంభిస్తుంది. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కరోనా భారిన పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలో రాబోయే ఎన్నికలకు అధికార పార్టీ అన్ని రకాలుగా సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి సంబంధించిన సమీక్షా సమవేశం జరుగుతుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ ఇంచార్జ్లు హాజరు అయ్యారు. ఈ కీలక సమావేశం జగన్ అధ్యక్షత వహించడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. నేటి సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాద్, విడుదల రజని దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మంత్రులు దూరంగా ఉండడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి కరోనా నిర్థారణ అయ్యింది. ఇటీవల ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తనను వారం రోజులుగా కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవలని బుగ్గన సూచించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నానని.. ఈ కారణంతోనే సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న నేటి గడప గడప ప్రభుత్వం సమీక్షకు హాజరు కాలోకపోయినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాగోలులో ఆసరా పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధర్మాణ హాజరు కావడంతో ఈ సమావేశానికి రాలేకపోయారు.. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత కారణంతో రాలెకపోయినట్లు వార్తలు వస్తున్నాయి.