ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి విడదల రజిని చలించిపోయారు. తన కారు ఆపి బాధితులను దగ్గరుండి ఆస్పత్రికి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని ట్రావెట్ బస్సు ఢీకొట్టిడంతో.. విజయవాడకు చెందిన నూర్జహాన్ (21), ఉమెరా (45)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ రివ్వూ సమావేశం కోసమని సెక్రెటేరియట్కు వెళ్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రమాద ఘటనను చూసి నిర్గాంతపోయారు.
మంత్రి వెంటనే తన కారు ఆపి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పి 108 వాహనం వచ్చే వరకు అక్కడే ఉన్నారు. బాధితులను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించాలని సూచించిన మంత్రి.. వెంటనే జీజీహెచ్ సూపరింటెండ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తన పర్సనల్ సెక్యూరటీ సిబ్బందిని కూడా బాధితులతో పాడు అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి పంపారు. మంత్రి విడదల రజిని మానవతా ధృక్పథం చూసి స్థానికులు హ్యాట్సాఫ్ అంటున్నారు. విడదల రజిని స్పందించిన తీరును స్థానికులు కొందరు తమ సెల్ ఫోన్లలో బందించారు. ఆ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి విడదల రజిని స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.