ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది మంత్రికి ప్రథమ చికిత్స అందించారు.
ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు బిజీ బీజీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పెద్దగా మీడియా ముందుకు రారు. తన పనేంటో తాను చూసుకుంటారు. అలాంటిది ఆమె స్టేజీ మీద మాట్లాడుతూ... అందరి ముందు కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాలు..
సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ […]
ఏపీ రాజకీయాలు ఈ మధ్య కాలంలో చాలా ప్రత్యేకం అయిపోయాయి. ఇక్కడ ఉండే సవాళ్లు, ఆరోపణలు, ట్విస్ట్ లు, త్యాగాలు, కవ్వింపులు మిగతా రాష్ట్రాలలో కచ్చితంగా ఉండవు. ఇంతేనా? ఏపీలో నాయకుల పని తీరుకి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఈ ర్యాంక్ లు బయటకి చెప్తూ ఉంటారు. గతంలో గడపగడపకి కార్యక్రమంలో ఏయే నేతలు ముందున్నారో సీఎం సారే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు పరిపాలన విషయంలో ఏ మంత్రులు […]
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరూ స్టార్ హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా సంతోషం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు వారి కీర్తి పతాకాలను అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడించారు అంటూ ట్రిపుల్ […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వస్తున్నా ప్రతిరోజూ ఎక్కడ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి విడుదల రజినీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. కాకపోతే మంత్రి ఇన్నోవా స్వల్పంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి విడుదల […]
పేద ప్రజలకు మేలు చేకూరే విధంగా రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ కింద 3,254 ప్రొసీజర్లకు పెంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. ఆరోగ్య శ్రీని ప్రారంభించిన కొత్తలో దీనిలో 942 ప్రొసీజర్స్ ఉండేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చేనాటికి 1059 ఉన్న ప్రొసీజర్స్ను 2,446కు పెంచారు. తాజాగా ఈ నెల 15 నుంచి 3,254 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ స్పందించగా.. బాలకృష్ణ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు […]
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి విడదల రజిని చలించిపోయారు. తన కారు ఆపి బాధితులను దగ్గరుండి ఆస్పత్రికి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని ట్రావెట్ బస్సు ఢీకొట్టిడంతో.. విజయవాడకు చెందిన నూర్జహాన్ (21), ఉమెరా (45)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ రివ్వూ సమావేశం కోసమని సెక్రెటేరియట్కు వెళ్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి […]