సమాజాంలో నివసించే ప్రతీ వ్యక్తికి ఓ కులం ఉంటుంది. ఆ కులం చేసే వృత్తినే కుల వృత్తి అంటారు. కుల వృత్తి అంటే దేవునితో సమానం అలాంటి వృత్తిని అసభ్య పదజాలంతో విమర్శిస్తే కఠిన చర్యలు తప్పవు అంటోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఓ కులానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రకరకాల పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదీ కాక వారికి ఆర్థికంగా కూడా చేయుతను అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది. ఈ క్రమంలోనే నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కుల వృత్తికి సంబంధించి వారి సామాజిక గౌరవానికి భంగం కలిగించే, కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులను ఇక నుంచి మంగలి, మంగలోడా, మంగలిది, బొచ్చు కొరిగేవాడ, కొండ మంగలి లాంటి పదాలతో పిలవరాదని తెలిపింది. అలా పిలిస్తే ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ పదాలను ఉపయోగించిన వారిని భారత శిక్షాస్పృతి 1860 చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు.
సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నాయీ బ్రాహ్మణుల సంఘం ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోని తెలంగాణలో కూడా తీసుకురావాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణుల ఐక్య వేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వారి సంక్షేమానికి జగనన్న చేదోడు పథకం కింద రూ. 10 వేల రూపాయాలను నాయీ బ్రాహ్మణులకు అందజేస్తోంది. మరి తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.