ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ద్వారా 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్, ఇళ్లు లేని ‘పేదలకు ఇళ్లు’, ‘జగనన్న చేదోడు’, ‘వైఎస్ఆర్ చేయూత’ వంటి సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ద్వారా 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్, ఇళ్లు లేని ‘పేదలకు ఇళ్లు’, ‘జగనన్న చేదోడు’, ‘వైఎస్ఆర్ చేయూత’, విద్యార్థులకు ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. వీటితోపాటుగా గర్భిణి మహిళలకు, బాలింతలకు కూడా పౌష్టికాహారం అందించేందుకు ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ చేతుల మీదుగా గర్భిణీలు, బాలింతలు డ్రై రేషన్ అందుకున్నారు. ఈ పౌష్టికాహారాన్ని అందించేందుకు ఒక్కొక్కరికి రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కోసం ఏటా సుమారు రూ. 2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. గర్భిణీలకు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించారు.
ఈ పథకం ద్వారా సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు 2 కిలోలు రాగి పిండి, 1 కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కేజీల బియ్యం, 1కేజీ పప్పు, అర లీటర్ వంటనూనె, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు అందిస్తున్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్తో నెలకు ఇచ్చే రేషన్ సరుకులు: 1కేజీ రాగి పిండి, 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా, 500 గ్రాముల బెల్లం, 500 గ్రాముల చిక్కీ, 500 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, అర లీటర్ వంటనూనె, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు అందిస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ స్కూల్ లో చిన్నారుల బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహంచాలని తెలిపారు. ప్రత్యామ్నాయ బోధనా విధానాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యత పొందేలా ప్రణాళిక చేయాలని తెలిపారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి వారికి తగిన వైద్య సూచనలు అందించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.