పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్యనందించుటకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులను చదివించుటకు తల్లులకు అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక వంటి పలు పథకాలను పక్కాగా అమలు చేస్తుంది. అక్షరాస్యత శాతం పెంచేందుకు విద్యారంగంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నాణ్యమైన విద్యనందించుటకు ప్రభుత్వం నాడు-నేడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్యనందించుటకు చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులను చదివించుటకు తల్లులకు అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక వంటి పలు పథకాలను పక్కాగా అమలు చేస్తుంది. ఏపీలో అక్షరాస్యత శాతం పెంచేందుకు విద్యారంగంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందించుటకు మరో కొత్త విధానం అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఏపీ ప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మానసిక స్థైర్యం పెంచడానికి.. స్కూళ్లకు రాకుండా దూరం అవుతున్న పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు తాజాగా ‘స్టూడెంట్ కౌన్సిలర్ల విధానం’ అమలు చేయాలని యోచిస్తోంది. విద్యామంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా నిర్వహించిన సమీక్షలో ఆదేశాలను జారీ చేశారు. ఈ స్టూడెంట్ కౌన్సిలర్లను రాష్ట్ర వ్యాప్తంగా మండలలాల వారీగా నియమించాలని తెలిపారు.
స్టూడెంట్ కౌన్సిలర్ల విధులు ఏమంటే.. విద్యార్థుల్ని రోజూ బడికి పంపేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, మధ్యలోనే బడి మానేసే పిల్లలను తిరిగి స్కూల్ కు రప్పించే ఏర్పాట్లు చేయడం, వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించుట, సర్కార్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, ప్రభుత్వ పథకాలు వారికి సక్రమంగా వినియోగించుకునేలా చేయడం.
అక్షరాస్యత పెంపొందించుటకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా విద్యార్థులను సర్కార్ స్కూల్స్కి రప్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీచర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ డైరెక్ట్గా వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నారు. విద్యాసంస్కరణలు అమలు పరిచే విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన పూర్తి కాబోతున్న నేపథ్యంలో వీటి ఫలితాలు అందేలా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకోసమే స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించాలని నిర్ణయించింది.