ప్రతీ మధ్యతరగతి మానవుడి సాధారణ కోరిక సొంత ఇల్లు ఉండటమే. దాన్ని కట్టడం కోసం అతడు పడరాని పాట్లు పడతాడు. చివరకి అప్పులు చేయడానికి కూడా వెనకాడడు. అతడు ఇంత కష్ట పడడానికీ ఓ కారణం ఉంది. సమాజంలో ఒక వ్యక్తికి ఇల్లు ఉందంటే అతడికి ఇచ్చే గౌరవమే వేరు. దానికోసమైన చాలా మంది సొంత ఇల్లు ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలి అనే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. పట్టణాల్లో ఉన్న మధ్య తరగతి ప్రజలకు, ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు పక్కా ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అడుగులు వేసింది. దీని కోసం 2015 జూన్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) అనే స్కీమ్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2022 మార్చి నాటికి అర్హులైన అర్బన్ లబ్దిదారులందరికీ పక్కా ఇళ్లను అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే దీని కాల వ్యవధి ముగియడంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థనతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకాన్ని పొడిగించింది. ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిసెంబర్ 31, 2024 వరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ను కొనసాగించాలని కేబినెట్ ఆమోదించింది. తాజాగా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. PMAY విభాగం లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు122.69 లక్షల ఇళ్లను జారీ చేయగా, వాటిలో 61.77 లక్షల ఇళ్లు పూర్తి అయినట్లు తెలిపారు. కరోనా కారణంగా ఈ స్కీమ్ వెనకబడినట్లు తెలిపారు. దాంతో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేస్తున్నాయి. మరి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Adding impetus to objective of #HousingForAll, Union Cabinet approves continuation of Pradhan Mantri Awas Yojana (Urban) till 31st December 2024. The decision, based on request of States/UTs, will help in completion of already sanctioned 122.69 houses under the Scheme. pic.twitter.com/Vx644fiCkf — Housing For All (@PMAYUrban) August 11, 2022 ఇదీ చదవండి: స్టీల్ వ్యాపారి కార్యాలయాలపై ITదాడులు.. వందల కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం! ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు చేశాడని పిల్ల తండ్రిపై వరుడు దారుణం! ఏకంగా ఆ భాగాలనే..