ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ హాట్ కామెంట్స్ చేస్తుంటే. వాటిని తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అధికార వైసీపీ పేదలకు సెంటు స్థలాన్ని ఇవ్వాలన్న వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది టీడీపీ. సమాధి కట్టుకోవడానికి తప్ప ఆ స్థలం ఎందుకు పనికిరాదంటూ..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార, ప్రతిపక్షాల మధ్య వేడి విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. అదికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ హాట్ కామెంట్స్ చేస్తుంటే.. వాటిని తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అధికార వైసీపీ పేదలకు సెంటు స్థలాన్ని ఇవ్వాలన్న వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది టీడీపీ. సమాధి కట్టుకోవడానికి తప్ప ఆ స్థలం ఎందుకు పనికిరాదంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు బైక్ ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉఫ ముఖ్యమంత్రి, సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీ సమయంలో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. బైక్ ర్యాలీ చేస్తున్న సమయంలో రెండు బైకులు ఢీ కొట్టడంతో రాజన్న దొర కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన్ను తక్షణమే ఇతర నేతలు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. పెద్ద ప్రమాదమేమీ జరగలేదని వెల్లడించారు. బైక్ వేగం స్వల్పంగా ఉండటంతోనే ఆయన భారీ ప్రమాదం నుండి తప్పినట్లు తెలుస్తోంది.