ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. జగన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును తెలుసుకునేందుకు “గడప గడపకు మన ప్రభుత్వం” అనేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్లి.. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ వర్క్ షాప్ కు.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను, నాయకులను సీఎం జగన్ ప్రశంసించారు. అంతేకాక ఈ కార్యక్రమంలో భాగంగా మరింత ముందుకు వెళ్లేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. రానున్న రోజుల్లో మీరు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. చాలా మంది ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో అనుకున్నదాని కంటే చాలా బాగా కష్టపడి ఇచ్చిన లక్ష్యాలను అధిగమించారు. అలానే గత సెప్టెంబరు 28న జరిగిన చివరి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యకమంలో 2600 గ్రామ, వార్డు కార్యదర్శులతో కలవాలని పెట్టుకున్నాము. అయితే గత 75 రోజుల్లోనే ఎమ్మెల్యేలు నిర్దేశించిన లక్ష్యం చేరుకున్నారు. అంతేకాక అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ చేయగలిగారు. 2700 గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శన చేయగలిగారు. క్షేత్రస్థాయిలో ప్రజలు చూపిస్తున్న ఆప్యాయత, వారి స్పందన క్యాడర్ లో కొత్త శక్తి , ఉత్సాహాన్ని నింపుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయం. అలానే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో, ప్రతీ ఇంట్లో, ప్రతీ వ్యక్తిని కలవాలి. అంతేకాక వారికి ఏమైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలి అని సీఎం తెలిపారు. ఐదు వేలకు పైగా సచివాలయాల పనితీరుకు సంబంధించిన నివేదికలు తన వద్ద ఉన్నట్లు సీఎం తెలిపారు. మొత్తం మీద ప్రతీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, కృషి.. వారిని ప్రజల వద్దకు మరింత చేరువ చేయడమే కాకుండా తమ లక్ష్యాలను అధిగమించేలా చేశాయని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక తదుపరి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్ష సమావేశం మార్చి మొదటి వారంలో ఉంటుందని తెలిపారు.