ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. వచ్చే ఏడాది కి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపు విషయంలో సీఎం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పుర, నగరపాలక, నగర పంచాయతీ పరిధిలో ఉన్న వారు దానికి సంబంధించి పేమెంట్ ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పన్ను ఒకేసారి మొత్తం చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. పన్నుల బకాయిలు సైతం పూర్తిగా వసూళ్లు చేయాలని సీఎం మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు చెల్లించని ఇంటి, నీటి బకాయీలు మార్చి నెలాఖరిలోగా చెల్లించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులు పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని కొన్ని చోట్ల దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది.