విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి విదితమే. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ల గన్నమనేని వెంకటేశ్వరరావును కొందరు కిడ్నాప్ చేశారు. హేమంత్, రాజేష్, సాయి ఈ కిడ్నాపులకు పాల్పడ్డారు. వీరిలో హేమంత్
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి విదితమే. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ల గన్నమనేని వెంకటేశ్వరరావును అపహరించారు దుండగులు. డబ్బు కోసం వీరిని అపహరించారని పోలీసులు నిర్ధారించారు. ఎంపీ లేని సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి తొలుత కుమారుడిని కిడ్నాప్ చేసి..ఆపై తల్లిని బెదిరించి నగలు, డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాత ఆడిటర్ దగ్గర డబ్బులు ఉంటాయని తెలిసి..అతడికి ఫోన్ చేయించారు. అతడు వచ్చాక ముగ్గుర్ని కిడ్నాప్ చేశారు. ఎంపీ ఆడిటర్కు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆయన అనుమానంతో పోలీసలకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆడిటర్కు ఫోన్ చేయగా.. అక్కడున్నా ఇక్కడున్నాను అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. టెక్నాలజీ సాయంతో ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టారు.
పోలీసులకు సమాచారం అందిందని తెలుసుకున్న దుండగులు.. ఈ ముగ్గుర్ని కారులో తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను వెంబడించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. హేమంత్, రాజేష్, సాయి ఈ కిడ్నాపులకు పాల్పడ్డారని చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరిని బెదిరించి రూ. 1.75 కోట్లు కిడ్నాపర్లు దోచుకున్నారని, రూ.86.50 లక్షలను రికవరీ చేశామని తెలిపారు. అయితే ఈ మొత్తం కేసులో ఈ కిడ్నాప్ డ్రామాను నడిపిందీ మాత్రం హేమంత్ అనే వ్యక్తి. అతడికి ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎలా వచ్చిందన్న ప్రశ్న మొదలైంది. అయితే తొలి నుండి హేమంత్ది నేర చర్రితే. అతడిపై రౌడీషీట్లు కూడా ఉండటం గమనార్హం. హేమంత్ పై మొత్తం 12 కేసులుండగా.. ఒక హత్య కేసు, 3 అపహరణ కేసులు, 3 గంజాయి కేసులున్నాయి. 2019లో నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోను, ఆ తర్వాత పీఎంపాలెం, భీమిలి పరిధిలోనూ రౌడీషీట్లు తెరిచారు.
కోలా వెంకట హేమంత్ తల్లిదండ్రులదీ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి స్కూల్లో ఆయా. వీరికి ఇద్దరు కుమారులు హేమంత్, మరో సోదరుడు ఉన్నారు. హేమంత్ సీఏ మధ్యలో మానేయగా.. సోదరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హేమంత్ దొంగతనాలకు కూడా పాల్పడ్డాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో గతంలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఓ మహిళను మాయమాటలతో మభ్యపెట్టి.. ఆమె మెడలో బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. అలాగే 2019లో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత విజయా రెడ్డిని ఆమె ఫ్లాటులోనే హత్య చేశాడు. మరో రాజకీయ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను కిడ్నాప్ చేసి.. కోటి డిమాండ్ చేశారు. మరో రియల్డర్ మధును కూడా అపహరించి రూ. 7.50 లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి.. మే 10న విడుదలై.. ఇప్పుడు ఏకంగా ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ కు పన్నాగం పన్నాడు. అతడికి రాజేష్ గ్యాంగ్ తోడయ్యింది. అయితే గతంలోనే ఎంపీ సత్యనారాయణకు హేమంత్ కు మధ్య పరిచయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.