విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేస్తూ.. అందరికి నాణ్యమైన విద్య అందించడమే లక్షంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాక.. చదువుకునే విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో.. అనేక పథకాలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తయారు చేయడం కోసం.. వాటి రూపు రేఖలు మార్చడం కోసం మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యావ్యవస్థలో మార్పుల కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఎంత మంచి ఫలితాన్ని ఇస్తున్నాయో.. ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
ఇప్పటి వరకు కాలేజీలకు మాత్రమే పరిమితైన సెమిస్టర్ విధానాన్ని ఇక మీదట పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకొస్తూ.. శనివారం ఉత్తుర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి స్కూల్స్లో ఈ సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో ముందుగా వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో..1-9వ తరవగతి వరకు రెండు సెమిస్టర్లు అమల్లోకి వస్తాయని.. అలానే 2024-25 నుంచి పదో తరగతికి కూడా సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
అలానే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే.. విద్యార్థులకు రెండు సెమిస్టర్లకు సంబంధించిన పుస్తకాలను జగనన్న విద్యా కానుక కార్యక్రమం ద్వారా పపిణీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.