ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తల్లుల అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే మూడుసార్లు నిధులను రిలీజ్ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి తల్లుల ఖాతాలో డబ్బులు ఈ రోజే జమ కానున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చింది. వాటిని అమలు చేయడానికి చాలా కృషి చేస్తుంది. ప్రతి ఇంటికి ఏదో ఓ పథకం ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. చదువుకునే విద్యార్థుల కోసం‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా పేద కుటుంబాలలోని పిల్లలు చదువుకునేందుకు ఫ్యామిలిపై ఆర్థిక భారం పడకుండా స్కాలర్షిప్, పీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రయోజనాలను కల్పిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుట కొరకు, ఉన్నత విద్యను అభ్యసించుటకు ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను ప్రభుత్వం తరపున అందిస్తారు. అలాగే ‘అమ్మఒడి’ ద్వారా చదివించే ఆర్థిక స్థోమత లేని తల్లులు తమ పిల్లలను చదివించేందకుగాను ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది.
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తల్లుల అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే మూడుసార్లు నిధులను రిలీజ్ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి తల్లుల ఖాతాలో డబ్బులు ఈ రోజే జమ కానున్నాయి. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. తన నివాసం నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత కురుపాంలోని బహిరంగ సభకు హాజరు కానున్నారు. అక్కడి కార్యక్రమాల్లో భాగంగా అమ్మఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేయనున్నారు. వరుసగా 10 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
జగన్ ప్రభుత్వం పిల్లలను బడికి పంపించే ప్రతి పేద తల్లులందరికి ప్రతి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం చేకూర్చుతుంది. దీనికి పేదరికమే అర్హతగా భావిస్తున్నారు. కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అనే తేడాలేకుండా చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ను తగ్గించుట కొరకు ప్రభుత్వం ఈ పథకాన్ని నూరు శాతం అమలు పరుస్తోంది. దీనికి కనీసం హాజరు శాతం 75 శాతం ఉండాలి. ఈ నిబంధనతో విద్యార్థుల తల్లులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్ కోసం రాష్ట్ర సర్కార్ ఎన్నో పథకాలను అమలుపరుస్తుంది. అలాగే నాడు-నేడు ద్వారా కూడా స్కూల్స్ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి.