క్రికెట్ మైదానంలో మెరుపులా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అంబటి రాయుడు.. ఇటీవల ఐపీఎల్ 2023 లో సీఎస్ కే తరుపు నుంచి ఆడి కప్పు గెలవడానికి దోహదపడ్డారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మైదానంలోకి దిగిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. క్రికెట్ కెరీర్ లో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న అంబటి ఐపీల్ సీఎస్కె తరుపున ఆడారు. ఈసారి కూడా సీఎస్కె టీమ్ ఐపీఎల్ – 2023 కప్పు గెల్చుకుంది. ఈ సందర్భంగా అంబటి రాయుడు క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా అంబటి రాయుడు తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనతో పలు పార్టీలు టచ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఏపీలో వైసీపీ అధికార పార్టీ అభివృద్ది పనుల గురించి సీఎం జగన్ ని ప్రశంసిస్తూ వరుసగా ట్విట్స్ చేస్తున్నారు అంబటి రాయుడు. గతంలో రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందని కొన్ని మీడియా సంస్థలకు చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు చెబుతున్నారు అంబటి.
గుంటూరు లో పుట్టి పెరిగిన అంబటి తిరుపతి రాయుడు సివిల్స్ చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ.. అనూహ్యంగా క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఏ పార్టీలో చేరుతా అన్న విషయం స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే ఆయన అధికార పార్టీలో చెరుతారని ప్రచారం జరుగుతుంది. గతంలో సీఎం జగన్ తో ఒకసారి భేటీ అయ్యారు. పార్టీలో చేర్చుకోవడానికి సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అంబటి రాయుడు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో జరిగి భేటీపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.