''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది'' సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ రాజధానుల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రాజధాని అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ దగ్గర నుంచి రాజధాని ఏది అనే అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. అయితే 2015లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నోటిఫై చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020లో అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు చేస్తున్నామని ప్రకటించింది. అయితే కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ విశాఖపట్నం రాష్ట్ర రాజధాని అవుతుందని చెప్పారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మూడు రాజధానులు చేసి తీరుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
”ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది” సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ మంత్రులు సైతం జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. పలు సభల్లో ప్రసంగాలు కూడా చేశారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా విశాఖపట్నం ఏకైక రాజధాని అని శ్రీకాకుళంలో జరిగిన బహిరంగసభలో పేర్కొన్నారు. ఇక ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం ఈ వ్యాఖ్యలే చేశారు. అయితే తాజాగా ఫిబ్రవరి 14న బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అనేది సమాచార లోపం. పాలన విశాఖ నుంచే జరుగుతుంది అని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఈ రాజధానుల విషయంపై స్పందిచారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ..”మూడు రాజధానుల విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మూడు రాజధానులు చేసి తీరుతాం. అభివృద్ది అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుడదనే మేం ఈ నిర్ణం తీసుకున్నాం. హైదరాబాద్ లో అన్ని వనరులు ఉన్నాయి, అయితే దానిని కోల్పోవడంతో చాలా నష్టపోయాం. మరోసారి అలా జరగకూడదనే మూడు రాజధానులు చేస్తున్నాం” అని అంబటి రాంబాబు ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
అన్ని ప్రాంతాల ప్రజలకు మంచి జరగాలనే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంబటి రాంబాబు తెలిపారు. అన్ని శాస్త్రియ కారణాలను దృష్టిలో ఉంచుకునే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చెయ్యాలన్న ఉద్దేశంతోనే మా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని అంబటి అన్నారు. మా ప్రభుత్వం అదే పాలసీని పాటిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మరి అంబటి రాంబాబు మూడు రాజధానులపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మూడు రాజధానులపై సందేహం అవసరంలేదు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు చేసి తీరుతాం. #APNeeds3Capitals pic.twitter.com/0hdXexUzSV
— YSR Congress Party (@YSRCParty) February 15, 2023