జగన్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా మరో కొత్త స్కీమ్ అమలు చేయడానికి సిద్ధం అయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వాటిని అమలు పరిచేందుకు సంక్షేమ ఫలాలను కింది వర్గాల వారికి చేరేందుకు వాలంటీర్లను కూడా నియమించారు. అన్ని విధాలుగా ఆదుకుంటున్న జగన్ ప్రభుత్వం తాజాగా మరో కొత్త స్కీమ్ అమలు చేయబోతోంది. పేదలకు తక్కువ రేటుకే భోజనం అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నక్యాంటీన్ల మాదిగా ఇప్పుడు ‘ఆహా క్యాంటీన్’లు రాబోతున్నాయి. వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఆర్థికంగా మహిళలు ఎదగాలని ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్యాంటీన్లను అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి మహిళలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఏపీలో కూడా అన్నా క్యాంటీన్ల మాదిరిగానే ‘ఆహా క్యాంటీన్’లు ప్రారంభం కానున్నాయి. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సర్కార్ ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి నిశ్చయించింది. ఇప్పటికే నగరిలో తొలి ఆహా క్యాంటీన్ ని మంత్రి రోజా ప్రారంభించారు. ఇంకా 110 మున్సిపాలిటీల్లో 140 ఆహా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పట్టణాల్లో సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లు నడుపనున్నారు. వీటిని ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఈ క్యాంటీన్ల అంశాలను చూసుకుంటుంది.
ఈ క్యాంటీన్లలో వంటకాలను ఇంటి దగ్గరే వండి.. వాటిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ల వద్ద సేల్ చేస్తారు. క్యాంటీన్లలో డిమాండ్ను బట్టి టిఫిన్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఏర్పాటు చేస్తారు. ప్లేటు భోజంన రూ. 40 కి అమ్మేటట్లుగా నిర్ణయించారు. అయితే ప్రభుత్వాసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లో మొదటి రోజు సేల్స్ బాగా అయ్యాయని మహిళలు చెబుతున్నారు. ఒక పూటకు రూ. 3వేల వరకు సేల్ అయినట్లు తెలిపారు. ‘ఆహా క్యాంటీన్’లు ఏర్పాటు చేసే డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం రూ.13 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. క్యాంటీన్ నిర్వహించే గ్రూపులు నెలకు రూ.500 చొప్పున మహిళా సమాఖ్య సొసైటీలో జమ చేయాలి.