సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు
నేటితరం యువత లైఫ్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఇదే అవకాశంగా తీసుకుని భారీగా వసూళ్లకు తెగబడుతున్నారు. చికిత్స విజయవంతం అయి పిల్లలు పుట్టి కొందరు సంతోషంగా ఉంటున్నారు. చివరకు మరికొందరు చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ సంతానం కోసం ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించింది. కానీ అక్కడ చికిత్స వికటించి తన ప్రాణాలనే కోల్పోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
కర్నూలు జిల్లా జొహరాపురం గ్రామానికి చెందిన మోదీన్ బీ అనే యువతికి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీసీ ప్యాపిలికి చెందిన వన్నూరు స్వామితో వివాహం జరుగింది. వన్నూరు స్వామి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలుగకపోవడంతో ఓ గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగే విధంగా ట్రీట్ మెంట్ చేస్తానని చెప్పింది. చికిత్స మొదలుపెట్టి మూడు నెలల సమయం అయ్యింది. మంగళవారం 3.45 గంటల టైంలో సర్జరీ ఉందని మోదీన్ బీని లోపలికి తీసుకుని వెళ్లారు. ఆమెను లోపలికి తీసుకెళ్లారు. మహిళకు ఓ ఇంజక్షన్ వేశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.
మహిళ మృతి చెందిన విషయం బయటకు రాకుండా ఓ గంటపాటు కాలయాపన చేశారు. తర్వాత బంధువులను లోపలికి పిలిచి మూర్చ వచ్చిందని అత్యవసర చికిత్స అందించాలని బెంగుళూరు తీసుకెళ్లాలని డాక్టర్ అన్నారు. ఆక్సిజన్ పంపింగ్ చేస్తూ బంధువులను నమ్మించారు. ఇలా నాలుగు గంటలపాటు ఆపరేషన్ థియేటర్లోనే ఉంచారు. రాత్రి 7.45 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చి, పోలీసులు రాగానే చనిపోయినట్లు బంధువులకు తెలిపారు.
మరణించిన మహిళ గుత్తి మున్సిపల్ ఛైర్ పర్సన్ మేనకోడలు కావడంతో బంధువులు చాలామంది ఆస్పత్రికి చేరుకున్నారు. కోపంతో ఊగిపోతూ ఆస్పత్రి అద్దాలను పగులగొట్టారు, ఐసీయూ గదిని ధ్వంసం చేశారు. అనస్తీషియా వైద్యుడిపై దాడి చేశారు. బంధువుల ఆగ్రహాన్ని చూసిన డాక్టర్ లోపలే ఉంది. సీఐలు, ఎస్సైలు తమ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని శాంతింపజేశారు. ఆరోగ్యంగా ఉన్న తన కూతురిని ఇంజక్షన్ చేసి చంపేశారని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలు కావాలనే కోరిక తన ప్రాణాల వరకు తెచ్చింది.