కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఓ వీఆర్వోకు షాక్ ఇచ్చారు. వీఆర్వో ప్రభుత్వ ఉద్యోగి అనికూడా చూడకుండా చెంపెదెబ్బలు కొట్టింది ఓ మహిళా రైతు. అదే గ్రామానికి చెందిన వీఆర్ఓ వేణుగోపాల్ తమ పేరున ఉన్నపొలాన్ని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించింది.
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులు పంట చేతికొచ్చేంత వరకు దిగులు చెందుతుంటారు. ఓ వైపు ప్రకృతి బీభత్సానికి పంట నష్టం వల్ల చేసిన కష్టం చేతికందక కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. వరదల కారణంగా పంట కోసం పెట్టిన పెట్టుబడి రాక, మార్కెట్లో సరైన రేటు రాక, తడిసిన ధన్యాన్ని మిల్లుల వద్ద కొనుగోలు కాక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇలా రైతులు ఏడాది పాటున కష్టపడుతూనే ఉంటారు. వారికున్న సదుపాయాలతో వ్యవసాయం చేసుకుంటూ నిత్యం జీవన పోరాటం చేస్తున్న రైతులకు కోపం వస్తే తిరగబడతారు. ఓ మహిళా రైతు తన భూమిని వేరొకరి పేరున పట్టా చేయడంతో కోపంతో వీఆర్వోను చెంప చెళ్లుమనిపించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఓ వీఆర్వోకు షాక్ ఇచ్చారు. వీఆర్వో ప్రభుత్వ ఉద్యోగి అనికూడా చూడకుండా చెంపెదెబ్బలు కొట్టింది ఓ మహిళా రైతు. అదే గ్రామానికి చెందిన వీఆర్ఓ వేణుగోపాల్ తమ పేరున ఉన్నపొలాన్ని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించింది. న్యాయం చేయాలని వేడుకుంటున్నా కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో స్థానికులంతా వచ్చి ఆమెకు సర్ధిచెప్పడంతో ఆమె శాంతించింది. ఇది కర్నూలు జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారికి ఎదురైన చేదు అనుభవం.
గోనెగండ్ల మండలం, నెలటూరు గ్రామానికి చెందిన వీరన్న, శివపార్వతులు దంపతులు. వీరికి సర్వే నెంబర్ 430లో తొమ్మిది ఎకరాల భూమి ఉంది. అయితే 2014లో వీఆర్ఓ సహకారంతో రాముడు 430 సర్వే నెంబర్ లోని రెండు ఎకరాల భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత రాముడు భూమి తనదేనంటూ కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఇష్యూ కారణంగా శివపార్వతుల తొమ్మిది ఎకరాల పొలం రెడ్ మార్క్లో ఉంది. దీంతో శివపార్వతుల దంపతులకు ప్రభుత్వం ద్వారా పొందవలసిన సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. న్యాయం చేయాలని ఆ దంపతులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన శివపార్వతి వీఆర్ఓ చెంప చెల్లుమనిపించింది. న్యాయం ఎప్పుడు చేస్తారంటూ నిలదీసింది. చుట్టు పక్కల ఉన్నవారంతా గుమిగూడి ఆమెకు నచ్చజెప్పారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.
వీఆర్ఓ చెంప చెళ్లు మనిపించిన మహిళ
కర్నూలు – తొమ్మిది ఎకరాల భూమి రెడ్ మార్క్ నుంచి తొలగించాలని పదే పదే కోరినా పట్టించుకోని విఆర్ఓ వేణు గోపాల్.
నిన్న గోనెగొండ్ల తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన
బాధితురాలు, భర్త మాజీ సర్పంచ్ వీరన్న. విసిగిపోయి చెంప చెళ్లుమనిపించిన మహిళ. pic.twitter.com/rmS7EnZovS— Telugu Scribe (@TeluguScribe) August 10, 2023