పిల్లల ముందే పొట్లాడుకుంటే వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. చిన్న విషయమైనా బలంగా నాటుకు పోతుంది. తల్లిదండ్రుల్లో ఒకరిపై నెగిటివ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో తండ్రి చేస్తున్న అరాచకాన్ని చూస్తూ ఊరుకోలేదు ఆ బాలుడు. తన వయస్సుకు మించిన పనిచేశాడు. ఇంతకు ఏమీ చేశాడంటే..?
పిల్లల ముందు భార్యా, భర్తల గొడవలు పడకూడదు.. వాటిల్లోకి పిల్లలను లాగకూడదు. అలా చేస్తే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల ముందే పొట్లాడుకుంటే వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. చిన్న విషయమైనా బలంగా నాటుకు పోతుంది. తల్లిదండ్రుల్లో ఒకరిపై నెగిటివ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కుంగిపోతారు. భవిష్యత్తులో వీరు నేరస్థులుగా మారిన దాఖలాలు ఉన్నాయి. అయినా ఏదో ఓ సందర్భంలో ఇంట్లో సమస్యలు, గొడవలు పిల్లల కంటికి కనిపిస్తాయి. అయితే అందరిలా మిన్నకుండిపోలేదు ఆ చిన్నారి. తన వయస్సుకు మించిన పనిచేశాడు. తన సమస్యను ధైర్యంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అమ్మ వేదన చూడలేక కన్నతండ్రిపైనే తొమ్మిదేళ్ల బాలుడు ఫిర్యాదు చేసిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లపాలెంలో ఇస్లాంపేటకు చెందిన సుభానీ, సుభాంబీ దంపతులు నివాసం ఉండేవారు. వారికి ఒక కుమారుడు రహీమ్ ఉన్నాడు. సుభానీ వడ్ల మిల్లులో,అలాగే మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో సుభానీ మద్యానికి బానిసయ్యాడు. రోజు రాత్రి మద్యం తాగి భార్యను చిత్ర హింసలకు గురి చేసేవాడు. తండ్రి ఆమెను కొట్టడం చూసిన తొమిదేళ్ల కుమారుడు రహీమ్.. తల్లి పడుతున్న బాధను చూడలేక.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రోజు మద్యం సేవించి, అమ్మను..మా నాన్న కొడుతున్నాడంటూ తన బాధను వెళ్లిబుచ్చాడు. పిల్లాడు ఇచ్చి ఫిర్యాదునివ్వడంతో కొంత ఆశ్చర్యానికి గురైన ఎస్సై.. అతని బాధను విన్నాడు. ఆ బాలుడి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్త్సె.. ఆ భార్యభర్తలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం జరిగితే ఊరుకునేది లేదని కోరాడు. అలాగే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు. మొత్తానికి ఆ చిన్నోడు తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తండ్రిపై కేసు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు సైతం అతడి ధైర్యానికి ఫిదా అయ్యారు.