విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.
పోలీసులు అంటే ప్రజల ధన, ప్రాణాలకు రక్షణగా నిలబడతారు. ప్రజలను రక్షించాల్సిన రక్షకభటులే భక్షిస్తుంటే సమాజం ఏంకావాలి? సమాజంలో పోలీసుల పాత్ర ప్రజా భద్రత, చట్ట నియమాలను గౌరవిస్తూ.. విధులు నిర్వహించడం. దొంగలను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసే దొంగల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ వరుస దొంగతనాలు చేసి పోలీసులకే షాక్ ఇచ్చాడు. పలు దొంగతనాలకు పాల్పడి.. పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడి.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. చివరకు ఎలా పట్టుబడ్డాడో పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఉద్యోగ పరంగా చండీగఢ్లో పదేళ్లపాటు విధులు నిర్వహించాడు. తర్వాత స్నేహితులతో చెడు వ్యసనాలకు బానిసైయ్యాడు. చాలా అప్పులు చేశాడు. ఉద్యోగాన్ని వదులుకుని తిరిగి విజయనగరం జిల్లాలోని సొంత గ్రామానికి చేరుకున్నాడు. పని చేసేందుకు తగిన అవకాశాలు రాలేదు పైగా చెడు వ్యసనాలతో ఏ పని సరిగ్గా చేయలేకపోయాడు. కొద్ది రోజుల తర్వాత కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. పని కోసం సొంత ఊరు వదిలి విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ కాలనీలో స్థిరపడ్డాడు.
కొన్ని రోజుల తర్వాత దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. పగలంతా రెక్కీ చేసి రాత్రి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. తను దొంగతనానికి వెళ్లినపుడు ఒంటరిగా వెళ్లేవాడు. సుమారుగా పన్నెండు చోట్ల దొంగతనాలు చేశాడు. భారీగా డబ్బు, బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయి. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కానీ పోలీసు పరిజ్ఞానం ఉన్న శ్రీనువాసరావు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. నగరంలోని వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారింది. దీంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఓ చోట సీసీ కెమెరాలో శ్రీనువాసరావు కనిపించాడు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఒక్కొక్క నిజాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. సుమారు ఇరవై ఐదు లక్షల విలువ చేసే బంగారు నగలు, ఆరు కిలోల వెండి వస్తువులు, చోరీ చేసేందుకు ఉపయోగించిన పనిముట్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.