సాధారణంగా అరుదైన పక్షులను చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. చాలా వరకు అవి నివసించే చోటుకి జనాలు ఎలాగో వెళ్లలేరు. కానీ అప్పుడప్పుడు ఆ అరుదైన పక్షులే ఎదురుపడితే కలిగే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. తాజాగా ఉత్తర అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షిని హైదరాబాద్ లోని చిక్కడపల్లి వాసులు కాపాడారు. అదేంటీ.. ఉత్తర అమెరికా పక్షిని వీళ్ళు ఎలా కాపాడారు? అని సందేహం కలగవచ్చు. కానీ ఇది నిజం.
వివరాల్లోకి వెళ్తే.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు చెట్టు పై ఉన్న గాలిపటం మంజా దారంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. ఆ వైపుగా వెళ్తున్న స్థానికులు ఆ పక్షి చిక్కుకున్న విషయాన్ని గమనించి రక్షించారు. అనంతరం దాని దాహాన్ని తీర్చి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓవల్ గా గుర్తించారు. ప్రస్తుతం ఓవల్ పక్షి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి అరుదైన పక్షి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.