North Korea: ఉత్తర కొరియా అంటే ఓ భయంకరమైన దేశం అని చాలా మంది అభిప్రాయం. వాళ్లలా అనుకోవటానికి కారణం లేకపోలేదు. కిమ్ వంశస్తుల రాక్షస పాలన కారణంగా ఆ దేశానికి ఆ పేరు వచ్చింది. అక్కడ ప్రజలపై విపరీతమైన ఆంక్షలు ఉంటాయి. కేవలం ప్రజలు మాత్రమే కాదు.. ప్రెస్, పర్యాటకంపై కూడా ఆంక్షలు ఉంటాయి. అలాంటి ఆ దేశానికి టూరుకు వెళ్లాలని ఎవరు అనుకుంటారు చెప్పండి.
కానీ, కొంతమంది మాత్రం ప్రాణం మీద ఆశలు వదులుకుని అక్కడ పర్యటించటానికి వెళుతున్నారు. అలాంటి వారిలో జాన్ ఒకడు. ఉత్తర కొరియాకు టూరుకు వెళ్లటమే కాదు.. ప్రాణాలు తెగించి మరీ ఓ నోటును స్మగ్లింగ్ చేశాడు. ఇంతకీ సంగతేంటంటే.. న్యూజిలాండ్కు చెందిన జాన్ కొన్నేళ్ల క్రితం ఉత్తర కొరియా టూర్కు వెళ్లాడు. అక్కడ పర్యటించి ఇంటికి వచ్చే సమయంలో అతడికో పిచ్చి ఆలోచన వచ్చింది.
తనతో పాటు ఉత్తర కొరియా కరెన్సీ నోటును తీసుకెళ్లాలనుకున్నాడు. ఓ బస్ డ్రైవర్ దగ్గర 5000 ఓన్ నోటును తీసుకుని సాక్సులో దాచుకున్నాడు. తర్వాత ఫ్లైట్ ఎక్కి తన దేశం చేరుకున్నాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ 2 సంగ్ ఉన్న ఆ నోటును తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. తాను ఎలా ఆ నోటును తీసుకొచ్చాడో రాసుకొచ్చాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘‘ ఆ నోటుతో గనుక నువ్వు పట్టుబడుంటే ప్రాణాలు తీసుండేవారు’. ‘ ఎందుకు కొంతమంది ఇలాంటి దేశాలకు కూడా టూరుకు వెళతారో అర్థం కాదు’. ‘ ఓ నోటు కోసం నీ ప్రాణాలను పణంగా పెడతావా’ అంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. మరి, 5000 ఓన్ నోటుకోసం ప్రాణాలకు తెగించిన జాన్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వామ్మో.. మండపంలోనే వరుడిని ఉతికి ఆరేసిన పెళ్లికూతురు..! వీడియో వైరల్