ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో ట్రైన్లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోజుకు కొన్ని కోట్ల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని వింతవింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం వింత వింత సంఘటనలే కాదు..గొడవలు కూడా జరుతున్నాయి. తాజాగా, చైనాలోని హాంకాంగ్లో.. మెట్రో రైల్లో ఓ యువతీ, యువకుడి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా సదరు యువకుడు యువతిపై దాడికి దిగాడు. ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనా, హాంకాంగ్లో మైట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్న యువతీ, యువకుడి మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. ఈ గొడవ కాస్తా చినికిచినికి గాలివాన అయిందన్న చందాన.. పెద్దదైంది. ఇద్దరూ ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. తర్వాత ఆ యువకుడు యువతిపై దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు.
వీరి గొడవను ఆపటానికి ఓ యువకుడు ప్రయత్నించి విఫలమాయ్యాడు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. వీరి గొడవను ఓ వ్యక్తి వీడియో తీశాడు. తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షల సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ సీట్ల కోసం కొట్టుకుంటున్నట్లు ఉన్నారు. మరి చైనాలో ఉన్న జనానికి ఆ రైళ్లు ఏం సరిపోతాయి’’.. ‘‘ అమ్మాయిపై చెయ్యి చేసుకోవటం ఎంత వరకు న్యాయం’’.. ‘‘ చైనాలో జనాలు కరోనాతో చస్తుంటే మీరేంట్రా ఇలా కొట్టుకుంటున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.