ఈ భూ ప్రపంచంపై మానవాళికి తెలియని వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. అలాంటి వింతలు అప్పుడప్పుడు బయట పడుతూ మానవాళి సాధించిన విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నాయి. యెమన్లోని సాకోత్రా ద్వీపసమూహంలో తాజాగా ఇలాంటి ఓ వింత బయట పడింది. డ్రాగన్ బ్లడ్ ట్రీ` గురించి మనలో చాలా మందికి తెలియదు. తిరగబడిన గొడుగు ఆకారంలో ఉండే ఈ చెట్లు చాలా విచిత్రమైనవి . ఇవి 650 సంవత్సరాల వరకు జీవించగలవు. 33 నుంచి 39 అడుగుల వరకు ఉండే ఈ చెట్లు వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఇక అన్నిటికి మించి ఈ చెట్టు బెరడును నరికితే అచ్చం రక్తంలా ఉండే ద్రవం బయటకు వస్తుంది. బెరడును కత్తిరిస్తే దాని నుంచి ఎర్ర రంగు రెసిన్లు బయటకు వస్తాయి. ఆ ద్రవం అచ్చం రక్తంలాగే కనిపిస్తుంది. దీనిని డ్రాగన్ జంతువు రక్తం అని స్థానికులు భావిస్తుంటారు. అందుకే ఈ మొక్కకు ఆ పేరు వచ్చింది.
ఇక స్థానిక ప్రజలు ఈ ద్రవాన్ని ఔషదంగా ఉపయోగిస్తారు. జ్వరం, అల్సర్, నొప్పులు తగ్గిస్తుందని, లైంగిక శక్తిని పెంచుతుందని పెంచుతుంది. కనీసం 10కి పైగా దేశాల్లో ఈ విషయం శాస్త్రీయంగా నిరూపితం అయ్యింది కూడా. దీంతో.., ఈ చెట్లు ఉన్న ప్రాంతాన్ని యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. నిజానికి ఈ చెట్ల వల్లనే సాకోత్రా ద్వీపసమూహంలో నీటి కొరత రావడం లేదని శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ.., ఇంత గొప్ప వృక్ష సంపదకి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఈ చెట్లు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇక్కడ తరుచుగా వచ్చే తీవ్ర తుఫానుల కారణంగా సాకోత్రా ద్వీపంలో ఉన్న డ్రాగన్ బ్లడ్ ట్రీ ఫారెస్ట్ నాశనమవుతోంది. ఇది పర్యావరణ సంక్షోభానికి హెచ్చరిక అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో.., ఇప్పుడు వృక్ష జాతిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలన్న డిమాండ్ ఎక్కువైంది. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.