ప్రేమ.. చరిత్ర పేజీలు తెరగేస్తే దీని కోసం ఎన్నో యుద్దాలు, మరెన్నో ఘటనలు ఇప్పటి సాక్ష్యంగా కనిపిస్తాయి. ఇక తాజ్ మహాల్ లాంటి ఎన్నో ప్రసిద్ద ఖట్టడాలు ప్రేమ చిహ్నంగా సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇలా చరిత్రలో ఎంతోమంది వ్యక్తులు ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఇదిలా ఉంటే పెరూకి చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. అయితే కొంత కాలం పాటు వీరిద్దరూ ఆన్ లైన్ ప్రేమాయణాన్ని కొనసాగించారు.
అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి సంవత్సరాలు గడిచింది. ఇక ప్రియురాలు మాత్రం ఎలాగైన 5,000 కిమీ దూరంలో ఉన్న ప్రియుడిని కలవాలని అనుకుంది. దీని కోసం ఆ మహిళ దాదాపుగా ఆ 5,000 కిమీ ప్రయాణించింది. కట్ చేస్తే ఆ మహిళ చనిపోయి బీచ్ లో శవమై కనిపించింది. ఈ విషయం ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఆ మహిళ మేనకోడలు ఆమె మరణించిన విషయాన్ని ఆమెతో ఫోటోతో సోషల్ మీడియలో పోస్ట్ చేసింది.
దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తన ప్రియుడి కోసం ఓ మహిళ ఏకంగా 5,000 వేల కిమీ ప్రయాణించడంతో ఆమె సాహసాన్ని అందరూ మెచ్చుకుని కంటతడి పెడుతున్నారు. ఇలాంటి ప్రేమికులు ఈ సమాజంలో ఉండరు అంటూ కామంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.