హిందూ సనాతన సంప్రదాయాలలో ఆచరించే ప్రతీ అలవాటుకు ఓ కారణం ఉంటుంది. అలాగే వాటికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. కొన్ని అలవాట్లలో సైంటిఫిక్ రీజన్ లేనప్పటికీ భారతదేశంలో తరాలవారిగా ఆ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే చాలా మందికి కొన్ని కొన్ని విషయాల గురించి తెలియవు. అలాంటి తెలియని విషయాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే? గోరింటాకు పెడితే చేతులు ఎరుపెక్కుతాయని మనందరికి తెలిసిందే. అయితే అలా ఎర్రగా పండటానికి కారణాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఇక గోరింటాకు అలా ఎర్రగా పండటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలకు చేతికి గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలైతే గోరింటాకును చేతులకు తెగ పెట్టుకుంటారు. అదీకాక గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని మన పెద్దవాళ్లు కూడా అంటుంటారు. అయితే పట్టణాల్లో గోరింటాకు దొరకడం కష్టం కాబట్టి.. ఎన్నో రకాల మెహందీ క్రీమ్ లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఊర్లో గోరింటాకుకు ఉన్న క్రేజే వేరు. సిటీలో దోరికే ఎన్ని క్రీమ్ లు వచ్చినా గానీ.. గోరింటాకు పెట్టుకుంటే పండినంత ఎర్రగా పండవు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు గోరింటాకు తెచ్చుకుని, దాన్ని మెత్తగా రుబ్బుకుని, గుంపులు గుంపులుగా కూర్చుని చేతులకు పెట్టుకుంటారు మహిళా మణులు. అయితే ఆ గోరింటాకు అంత ఎర్రగా పండటానికి కారణాలు ఏంటో మీకు తెలుసా? తెలీకపోతే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మన శరీరంలో స్కిన్ నాలుగు పొరలుగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. అందులో పైన ఉండే తొలి పొరను స్త్రేటమ్ కార్నియం అని రెండో దానిని వరుసగా.. ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్ క్యూటేనియస్ లు అని పిలుస్తారు. ఇక మనం చేతిపై గోరింటాకు పెట్టగానే దానిలో ఉండే నీటితో కలిగిన ఎర్రని రంగు.. తొలి పొర నుంచి వెళ్లి రెండో పొర దగ్గర ఆగిపోతుంది. ఇక మనం కొంత సేపు గోరింటాకు పెట్టుకుని అది ఆరిపోయే దాక ఉంటాం. ఆ తర్వాత గోరింటాకు ఎండిపోగానే రంగుతో కలిసిపోయిన నీరు.. మన బాడీ ఉష్ణోగ్రతకు ఆవిరై పోతుంది. రంగు మాత్రం అలానే శరీరంపై ఉండిపోతుంది. దాంతో గోరింటాకు తీసేసిన తర్వాత కూడా ఎర్రని రంగు కనిపిస్తుంది. ఇక గోర్లకన్నా చేతి స్కిన్ లోని రంధ్రాలు విశాలంగా ఉండటంతో.. గోళ్ల రంగు కంటే ముందే చర్మంపై ఉన్న రంగు త్వరగా పోతుంది. ఇదీ గోరింటాకు పెట్టుకుంటే చర్మం ఎరుపెక్కడానికి అసలైన కారణం.