కర్ణాటకలోని ‘శక్తి యోజన’ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు సీఎం సీద్దరామయ్య తెలిపిన విషయం తెలిసిందే.
సాధారణంగా బస్సు, ట్రైన్లలో ప్రయాణించే సమయంలో సీట్ల కోసం గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ గొడవలు శృతిమించి కొట్టుకునే స్థాయికి వెళ్తుంటాయి. మహిళలు అయితే ఒకరినొకరు దూషించుకోవడం, జట్లు పట్టుకొని కొట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. ఆ సమయంలో కండెక్టర్, డ్రైవర్, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని గొడవని సర్ధుమణిగేలా చేస్తుంటారు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ‘శక్తి యోజన’ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలైనప్పటి నుంచి కొత్త సమస్యలకు మొదలయ్యాయి.. బస్సుల రద్దీ కారణంగా సీటు కోసం మహిళలు కొట్టుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో ఇద్దరు మహిళలు సీటు విషయంలో తీవ్ర వాగ్వాదానికి దిగి కొట్టుకున్నారు. దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. సీఎంగా సిద్దరామయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ‘శక్తి యోజన’ కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క మహిళ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. దీంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే బస్సుల్లో సీట్ల కోసం మహిళ మధ్య అప్పుడప్పుడు తీవ్ర ఘర్షలు ఏర్పటుతున్నాయి. ఆ సమయంలో ఒకరినొకరు దూషించుకుంటూ.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకుంటున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేస్తే వారిని సైతం నానా బూతులు తిడుతున్నారు. కొన్నిసార్లు వారిపై కూడా దాడులకు తెగబడుతున్నారు.
కర్ణాటకలో ఓ బస్సు ప్రయాణికుల కోసం స్టాప్ వద్ద ఆగింది.. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది మహిళలు ఒకేసారి బస్సులోకి ఎక్కారు. బస్సులోకి ఎక్కిన తర్వాత సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. మొదట తాను ఆ సీటుపై కూర్చున్నా అంటే లేదు తానే ముందుగా సీటు ఆపానని ఇద్దరి మద్య వాగ్వాదం కాస్త ముదిరిపోయింది. ఈ క్రమంలో ఓ మహిళ మరో మహిళపై రెచ్చిపోయింది. తీవ్రంగా దూషిస్తూ.. జుట్టు చేతిలో పట్టుకొని ఊపుకుంటూ కొట్టింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఆమెను ఆపే ప్రయత్నం చేయగా అతనిపై కూడా విరుచుకుపడింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Kalesh b/w Two Woman inside KSRTC bus over seat issues in Tumkur, karnataka pic.twitter.com/GK6wy9yBcN
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 24, 2023