కర్ణాటకలోని ‘శక్తి యోజన’ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు సీఎం సీద్దరామయ్య తెలిపిన విషయం తెలిసిందే.
ప్రతి రోజు మనం ఎక్కాల్సిన బస్సు.. మన స్టాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎవ్వరైనా సీటు ఇవ్వకపోతారా అని ఆశగా చూస్తాం. ఎవ్వరూ ఇవ్వరూ. ఇక ఆ తోపులాటలోనే బస్సులో వేలాడుతూ వెళతాం. అయితే బస్సు సీటు విషయంలో ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని తన్నుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.