యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఇక ఆయన రచనలు ఎన్నో తెలుగులో సూపర్హిట్ సినిమాలుగా తెరకెక్కాయి. ఇక తాజాగా యండమూరి ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాలు..
యండమూరి వీరేంద్రనాథ్ గురించి తెలుగు పాఠకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తన రచనలతో తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు యండమూరి. చిరంజీవిని నవలా హీరో చేసిన ఘనత యండమూరిదే. ఆయన రచనల్లో ఎన్నో నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. వాటిల్లో అధిక భాగం చిరంజీవినే హీరోగా నటించాడు. అవన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పంది. ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కు గురైంది. ఆ వివరాలు..
యండమూరి గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారుకు సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. తిమ్మారెడ్డిపల్లి శివారులో యండమూరి కారును.. ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యండమూరి కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు.. కారులో ప్రయాణిస్తున్న యండమూరి, డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలుస్తోంది. యండమూరి వీరేంద్రనాథ్ కారు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు కాల్ చేసి ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.
రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యండమూరి.. 1948 నవంబర్ 14న తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించాడు. ఇక ఆయన అనేక రంగాల్లో రాణించాడు. ఛార్టెడ్ అకౌంటెంట్, నవలా రచయిత, సినీ స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్గా సేవలందించారు. 1980ల నుంచి నేటి వరకు ఆయన రచించిన ఎన్నో పుస్తకాలు లక్షల కొద్దీ కాపీలు అమ్ముడయ్యాయి. ఇక ఆయన రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి-యండమూరి కాంబినేషన్ తెలుగు నాట హిట్ పెయిర్గా నిలిచింది. చిరంజీవిని నవలా నాయకుడిగా నిలబెట్టిన ఘనత ఆయనదే. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.