ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ కూడా ప్రమాదాల భారిన పడుతున్నారు.
ఈ మద్య దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. సామాన్యులే కాదు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైతం రోడ్డు ప్రమాదాల భారిన పడుతున్నారు. తాజాగా ఓ సాథియా మూవీ హీరో వాహనానికి ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. దివ్య భావన దర్శకత్వంలో ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. ప్రేమ కథల్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ‘ఓ సాథియా’ మూవీ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం తొలిప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. కాజేజీ ఏజ్ లో చేసిన అల్లరి, ఎమోషన్స్, చిలిపి పనులు సంబంధించిన మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ మరపురాని మధుర స్మృతులు పాయింట్ గా తీసుకొని ఈ సినిమాను దివ్య భావన తెరకెక్కించారు.
తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై రాబోతుంది. ఈ చిత్రానికి చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. రేపు శుక్రవారం, జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అంతా ఓకే అనుకున్న సమయంలో ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేపు మూవీ రిలీజ్ ఉండగా.. ఈ రోజు చిత్ర హీరో ఆర్యన్ గౌరా కారుకి ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది.. ఏంటీ అనే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కారుకు సంబంధించి ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.