ఆనాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలో వర్గాల బేధం, ప్రాంతాల బేధం, పార్టీల బేధం చూపించకుండా ప్రజల సమస్యలపైనే సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. అధిక పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డ్ సృష్టించారు.
రాజకీయ పరంగా జనం నేతల దగ్గరికి రావడమే కానీ.. ప్రజల దగ్గరికి నేతలు కదిలి రావడం అనేది చైతన్య రథం నుండి మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ దీనిని మొదలు పెట్టారు. దీంతో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రాజకీయ పరంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేస్తుంటే ఊర్లు ఊర్లే కదిలి వచ్చేవి. అంతటి అభిమానం ప్రజల్లో సంపాదించుకున్నారు. నేతలు ప్రజల వద్దకు రావడంతో వారి జీవన గమనాలు, గ్రామాల ఉనికి తెలుస్తుంది. వారు వృత్తిరీత్యా ఎదుర్కొంటున్నసమస్యలను, నిత్య జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఏ పాదయాత్ర గురించి చెప్పినా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకోవలసిందే.
ఆనాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలో వర్గాల బేధం, ప్రాంతాల బేధం, పార్టీల బేధం చూపించకుండా ప్రజల సమస్యలపైనే సాగింది. రాష్ట్ర నలుమూలల సాగింది. అలాగే వారి కుమార్తె వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర కొనసాగించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. తెలంగాణలో తన పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకంజ వేయకుండా ముందుకు సాగించారు. వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగి.. వ్యవహారం కోర్టు వరకు వెళ్లినా కూడా అనుమతులు తెచ్చుకుని పాదయాత్ర కొనసాగించారు షర్మిల. అయితే ఓ మహిళ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం గర్వించదగ్గ విషయం. అధిక పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డ్ సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో 3800 కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేసి రికార్డ్ నెలకొల్పింది వైఎస్ షర్మిల.‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు సంపాదించుకుంది. ఈ సందర్బంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్ట్ ప్రతినిధులు వైఎస్ షర్మిలను కలిసి అభినందించి, అవార్డును ప్రదానం చేశారు. గతంలో వైఎస్ జగన్ కోసం ఆంధ్రప్రదేశ్లకో కూడా పాదయాత్ర చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇంత ఎక్కువ దూరం పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో మాత్రం చాలా అడ్డంకులను అధిగమించి పాదయాత్ర కొనసాగించాల్సి వచ్చింది. ఆమె పాదయాత్రను గుర్తించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులకు వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపింది.