గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. కరోనా సమయంలో మనిషిన చూసి మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పని సరి అయ్యింది. సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారని అంటారు.. కానీ వారిలోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తుంటాయి. తాజాగా, అలాంటి ఘటనే ఒక వరంగల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాయపర్తి మండలం కొండాపూర్ పరిధిలోని ఊర చెరువు పక్కన ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఎస్సై బండారి రాజు.. నడవలేని స్థితిలో ఉన్న వృద్దుడిని చూశారు.
ఇది చదవండి : లెక్చరర్ టు మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్.. సత్తా చాటిన శ్రీకాకుళం మహిళ
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎవరూ ఆ వృద్దుడి దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. దాంతో ఎస్సై స్వయంగా ఆయనకు లుంగీ కట్టి, చొక్కా తొడిగి 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే అక్కడికి అంబులెన్స్ వచ్చే సౌకర్యం లేకపోవడంతో వృద్ధుడిని తన భుజాలపై వేసుకుని కిలోమీటరు దూరం నడిచి అంబులెన్స్ వద్దకు చేర్చారు. అక్కడి నుంచి మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలిపారు. ముక్కు, ముఖం తెలియని ఆ వృద్దుడి ప్రాణాలు నిలిపేందుకు సాహసం చేసిన ఎస్సైపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.