ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు జానకీ పురం సర్పంచ్ నవ్యకు మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో రాజయ్య తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు ఫోన్ లో వేధింపులు మొదలయ్యాయి.
స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్య తాను తన నియోజక వర్గంలో పాల్గొన్న మీటింగ్ లలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్షలపాలయ్యారు. ఈ ఘటనలపై రాజకీయదూమారం చెలరేగింది. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం ధర్మసాగర్ మండలం జానకీ పురం సర్పంచ్ నవ్యను ఎంఎల్ఎ రాజయ్య లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చి ప్రకంపనలు సృష్టించాయి. తనను లైంగికంగా ఎంఎల్ఎ వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. ఆ తర్వాత ఎంఎల్ఎ రాజయ్య సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి మీడియా సమక్షంలో మహిళాలోకానికి క్షమాపణలు తెలిపాడు. అంతేకాకుండా జానకీపురం గ్రామానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే సర్పంచ్ నవ్యకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రోజుకో లక్ష ఇస్తా పడు**కుంటావా అంటూ వేధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంఎల్ఎ రాజయ్యపై గతంలో ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మరో సారి ఆరోపణలు గుప్పించింది. గ్రామాభివృద్దికి గతంలో రూ. 25 లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాటమార్చి గతంలో రూ. 20 లక్షలు అప్పుతీసుకున్నట్టుగా సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపింది. ఎంఎల్ఎ వేధింపులకు సంబంధించి తన దగ్గర ఆదారాలున్నాయని చెప్పింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో సర్పంచ్ నవ్యకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రోజుకో లక్ష ఇస్తా వచ్చి పడు**కొనిపో అంటూ వేధించిన ఆడియో బయటకొచ్చింది. దీనికి నవ్య సీరియస్ గా స్పందిస్తూ నీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే లక్షలు తీసుకుని పంపిస్తున్నావా అంటూ ఘాటుగా సమాదానం చెప్పింది. నువ్వు మనిషివేనా నీ భార్య, తల్లిని, చెల్లిని ఇలాగే పంపిస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్ నవ్య ఎంఎల్ఎ రాజయ్యకు మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.