తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్లో నేడు తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు. అంతేకాదు టీఎస్ ఎంసెట్ 2022 ఫలితాల ఫైనల్ ఆన్సర్ ‘కీ’ కూడా ఆమె రిలీజ్ చేశారు. అలాగే ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులను సాధించినట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఇంజినీరింగ్లో లక్ష్మీసాయి లోహిత్రెడ్డికి మొదటి ర్యాంకు, సాయిదీపికకు రెండో ర్యాంకు, కార్తికేయ మూడో ర్యాంకు సాధించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను www.eamcet.tsche.ac.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.