ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని.. ఫెయిల్ అయ్యామని ఆవేదనతో క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడదల చేశారు.
కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు పాఠశాల, కాలేజీ విద్యార్థుల విషయంలో తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారికి ఆర్ధిక భరోసా ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకుంటాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. పరీక్షలు సులువుగా రాసేలా విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పరీక్ష పేపర్లలో ఇది వరకూ ఉన్న ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించి దాన్ని మరింత సరళీకృతం చేసింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్లో నేడు తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు. అంతేకాదు టీఎస్ ఎంసెట్ 2022 ఫలితాల ఫైనల్ ఆన్సర్ ‘కీ’ కూడా ఆమె రిలీజ్ చేశారు. అలాగే ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులను సాధించినట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఇంజినీరింగ్లో లక్ష్మీసాయి లోహిత్రెడ్డికి మొదటి ర్యాంకు, […]
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన వారిలో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా పాస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం పరీక్షలు యథావిథిగా నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 […]
కరోనా మహ్మమారి వలన దాదాపు రెండేళ్లు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. 2021-22 విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ తరగతులతో పాటు పాఠశాలల్లో బోధించారు. కరోనా కంటే ముందు ప్రతిసారి వేసవి సెలవు అనంతరం జూన్ 12 పాఠశాలల పునఃప్రారంభమవుతాయి. ఒక వేళ ఏదైనా హాలిడే వస్తే జూన్ 13న పాఠశాలలు తెరుచుకుంటాయి. ఈసారి తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా […]
సమాజంలో పేదరికంతో నలిగిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరికి స్వయంగా సాయం చేయడం కుదరకపోవచ్చు. కానీ వారి గురించి బయటి ప్రపంచానికి తెలియజేస్తే.. వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చేవారు ఉంటారు. అలాంటి మంచిపనే సుమన్ టీవీ చేస్తుంది. గతేడాది నవంబర్ లో సుమన్ టీవీ సబిత అనే ఇంటర్ విద్యార్థిని గురించి ఓ వీడియో చేసింది. అది వైరల్ కావడమే కాక దానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు సంతోషాన్నిచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న సబితను […]
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు..రాష్ట్రంలో ఎంతటి రాజకీయ వేడిని రాజేశాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షకి హాజరు కాగా, వీరిలో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. మిగతా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో విద్యార్థి తల్లితండ్రులు, విపక్షాలు ఇందుకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలంటూ ఇన్ని రోజులు ధర్నాలు చేస్తూ వచ్చారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకి సైతం పాలపడ్డారు. ఈ నేపధ్యంలోనే తాజాగా […]
దణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇది డల్టావేరియంట్ కన్నా ప్రమాదకరమైన వేరియంట్ అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ అంత భయంకరమైనదేమీ కాదని కొందరు, అది చాలా డేంజరని మరికొందరు చెబుతుండడంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఆన్ లైన్ క్లాసులు మొదలైనా.. కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు దానిపై దృష్టిపెట్టకపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగా […]