చేర్యాలలో ‘ఇంద్ర’ సినిమాలోని సీన్ రిపీట్ అయ్యింది. ఓ హిజ్రా పూజల పేరుతో యువకున్ని మోసం చేసింది. అతన్ని నమ్మించి బంగారం తీసుకుని ఉడాయించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీలోని ఫేక్ పూజారిగా నటించిన బ్రహ్మానందం సీన్ చేర్యాలలో జరిగింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా చాలా మంది ఇలా ఫేక్ పూజలు చేసి మనుషుల వీక్నెస్ క్యాచ్ చేసుకుని నమ్మిస్తారు. వారు ఏది చెబితే అది నిజమని వినేలా చేసి మోసం చేస్తున్నారు. దొరికినంత వరకు దోచుకెళ్తారు. తాజాగా పూజలు చేసి, వారికి ఉన్న దోషాలను తొలగిస్తానని ఓ యువకుడిని నమ్మించింది. నగలతో పూజలు చేస్తే దోషం పోతుందని బంగారంతో జంప్ అయింది హిజ్రా. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు హిజ్రా కోసం గాలిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడకు చెందిన అబిద్ షేక్ మస్తాన్ అనే హిజ్రా, సిద్ధిపేట జిల్లా చేర్యాలకు చెందిన మధుతో పరిచయం చేసుకుంది. ఒకసారి చేర్యాలోని మధు ఇంటికి మస్తాన్ ను రమ్మన్నాడు. ఇంట్లో వారిపై నగలపై హిజ్రా కన్నుపడింది. ఎలాగైనా కాజేయాలని పథకం పన్నింది. మీ ఇంట్లో దోషం ఉందని, మీ ఎదుగుదలను ఓర్వటం లేదని వారిని మాయ మాటలతో నమ్మించింది. దోషం పోవాలంటే పూజలు చేయాలని, ఇంట్లో అమ్మవారికి అలంకరణ చేసి శాంతి చేయాలని చెప్పింది. హిజ్రా మాటలు నమ్మి మధు, పూజలు చేసేందుకు తయారయ్యారు.
ఇంట్లో కుటుంబసభ్యుల ఒంటిపై ఉన్న నగలను అమ్మవారికి అలంకరించాలంటూ తీసుకుంది. తీసి విగ్రహానికి పెట్టింది. పూజ తర్వాత విగ్రహాన్ని పాతిపెట్టి నగలు మాత్రమే తీసుకోవాలని చెప్పి పూజ చేసింది. పూడ్చిపెట్టి వస్తానని చెప్పి గుడి దగ్గర మధును కూర్చోబెట్టి నగలను తీసుకుని జంప్ అయింది. చాలాసేపటికి రాకపోయేసరికి అనుమానం వచ్చింది. చుట్టుపక్కల అంతా వెతికాడు. ఫోన్ చేసినా ఫలితం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హిజ్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.