పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంకీర్తన, వయసు 19 ఏళ్లు. నగరంలో ఉంటూ ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే శుక్రవారం తన చిన్నమ్మ ఇంటికి వెళ్లాలనుకుంది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పేరు సంకీర్తన, వయసు 19 ఏళ్లు. నల్లగొండ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన ఈ యువతి నగరంలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే శుక్రవారం ఈ అమ్మాయి తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ ఎక్కింది. అలా కొద్ది దూరం వెళ్లింది. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిన సీన్ చూసి సంకీర్త తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
నల్లగొండ జిల్లా మర్రిగూడ ప్రాంతానికి చెందిన సంకీర్త (19) హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఓ హాస్టల్ నివాసం ఉంటూ బండ్లగూడలో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. రోజు కాలేజీకి వెళ్లడం, తిరిగి మళ్లీ హాస్టల్ కు రావడం చేసేది. ఇదిలా ఉంటే సంకీర్తన శుక్రవారం రాత్రి వనస్థలిపురంలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఇక ఇందులో భాగంగానే ర్యాపిడో బైక్ ఎక్కి వెళ్తుండగా పనామా చౌరస్తా వద్ద ఈ యువతి బైక్ నుండి జారి కింద పడింది.
ఈ క్రమంలోనే వెనకాల నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఈ అమ్మాయిని ఢీ కొట్టింది. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. దీనిని గమనించిన వాహనదారులు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో సంకీర్తన రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న సంకీర్తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.